TTD Alert On Social Media Fraud Targeting Devotees: తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియాలో భక్తులను మోసగిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన కామసాని పవన్కుమార్ అలియాస్ నాగరాజు, బోడిరెడ్డి చెన్నకేశవులురెడ్డి భక్తుల్ని మోసం చేస్తున్నారు. వీరిద్దరు గుర్తుతెలియని ఫోన్ నంబర్లు ఇచ్చి యూపీఐ ద్వారా రూ.వేలల్లో డబ్బులు వసూలు చేసేవారు.దాదాపు వందమందికిపైగా భక్తులను మోసగించారు.