Tirumala TTD Sowbhagyam August 08: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామలరావు కలిసి ఈ కార్యక్రమాలను ఆవిష్కరించారు. విద్యార్థుల కోసం సద్గమయ, మహిళల కోసం సౌభాగ్యం వంటి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఈవో పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి డబ్బులు అడుగుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది.