TTD Legal Notice On Unauthorized Use Of Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరుతో నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్న సంస్థలపై టీటీడీ సీరియస్ అయ్యింది. జీఐ హక్కులను ఉల్లంఘించినందుకు 'పుష్ మై కార్ట్'తో సహా పలు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వారి ఉత్పత్తుల నుంచి లడ్డూ పేరును తొలగించాలని ఆదేశించింది. భక్తుల మనోభావాలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు హెచ్చరించారు. లడ్డూ పవిత్రతను కాపాడటానికి టీటీడీ కట్టుబడి ఉంది.