TTD To Distribute Laddu Vada To Employees: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియడంతో.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ పింఛన్దారులకు అక్టోబర్ 15 నుంచి 24 వరకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలు అందిస్తారు. మరోవైపు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం నవంబర్ 16న అంకురార్పణ, 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.