Tirumala Vaikunta Dwara Darshan Tickets EDip First Day: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లకు భక్తుల నుంచి అపూర్వ స్పందన లభించింది. తొలిరోజే రికార్డు స్థాయిలో 2.16 లక్షల మంది నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అమరావతిలో శ్రీవారి ఆలయ రెండో ప్రాకార పనులకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. భక్తులకు దర్శన సౌకర్యాలు మెరుగుపరచాలని సూచనలు చేశారు.