Tirumala Vaikunta Dwara Darshan Without Ticket Also: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు జరిగే ఈ దర్శనాల్లో, 164.15 గంటలు సామాన్య భక్తులకే కేటాయించామని, 7.70 లక్షల మంది దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎటువంటి టోకెన్లు లేకుండా నేరుగా సర్వదర్శనానికి రావచ్చని సూచించారు.