TTD Still Received Demonetized Currency In Hundis: తిరుమల శ్రీవారి హుండీలో ఇంకా రద్దైన నోట్లు కానుకలుగా సమర్పిస్తున్నారు కొందరు భక్తులు. దేశంలో గతంలో రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను హుండీలలో గుర్తించారు. ఇలా మొత్తం రూ.400 కోట్ల వరకు ఉంటాయని తెలుస్తోంది. రూ.2వేల నోట్లు కూడా హుండీలలో కానుకలుగా సమర్పిస్తున్నారు కొందరు భక్తులు. రూ.2వేల నోట్లను టీటీడీ మార్చుకుంటున్నా.. రూ.500, రూ.1000 నోట్ల విషయంలో టీటీడీకి ఇబ్బంది ఎదురవుతోంది.