Tirumala TTD Rs 10 Lakh Donation: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ముత్తవరపు నాగరాజు ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.10,00,116 విరాళంగా ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు దాతను అభినందించారు. ఇదిలా ఉండగా, తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఛైర్మన్ బిఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు.