Chandrababu on P4 Event at mangalagiri: తిరుమల శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం అందించారు. వెంకటేశ్వరస్వామికి 121 కేజీల బంగారం విరాళంగా ఇస్తున్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మంగళగిరిలో జరిగిన పీ4 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆ అజ్ఞాత భక్తుడి పేరు మాత్రం చంద్రబాబు బయటపెట్టలేదు.