Ambani Rs 100 Crores Donation To TTD: రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం రూ.100 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక అన్నప్రసాద కేంద్రానికి ఆయన ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో రోజుకు రెండు లక్షల మందికి అన్నం అందించే ఈ కేంద్రం నిర్మాణంలో రిలయన్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అనంతరం కేరళలోని గురువాయుర్ ఆలయానికి రూ.15 కోట్ల విరాళం అందించారు.