Tirumala Sanjiv Goenka Ornaments Donation: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీఎస్ గ్రూప్ అధినేత సంజీవ్ గోయెంకా తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేశారు. ఆయన కుటుంబసమేతంగా విచ్చేసి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు కోట్ల రూపాయల విలువైన కటి హస్తం, వరద హస్తాలను శ్రీవారికి కానుకగా సమర్పించారు. టీటీడీ అధికారులు ఆయనకు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని గోయెంకా తెలిపారు.