Tirumala 70 Kgs Koppera Hundi Donated: తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర వంశీయులు 70 కిలోల బరువున్న కొప్పెర హుండీని అందించారు. 1821 నుంచి వంశపారంపర్యంగా ఈ సేవ చేస్తున్నారు. ప్రతి ఏటా వీరు కొప్పెర హుండీని కానుకగా అందించడం ఆనవాయితీా వస్తోంది. టీటీడీ రవాణా విభాగం ఆయుధపూజ ఘనంగా నిర్వహించింది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబర్ 17 నుండి 19 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.