TTD Golden Lakshmi Pendant Donated: తిరుమల శ్రీవారికి ఇశాళ భక్తులు కానుకలు సమర్పించారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన భక్తుడు శ్రీవారికి రూ.25 లక్షల విలువైన వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందజేశారు. అదేవిధంగా, మరో భక్తుడు అన్నప్రసాద ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఆగష్టు 16న గోకులాష్టమి సందర్భంగా గోసంరక్షణ శాలలో గోపూజ నిర్వహించనున్నారు. అమరావతిలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఆగష్టు 19 నుండి 21 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.