తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భక్తులు అత్యంత విలువైన కానుకను సమర్పించారు. సుమారు రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంఖం, చక్రాన్ని మంగళవారం రోజున స్వామివారికి విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు ఈ కానుకల్ని అందజేశారు. ఈ ఆభరణాల బరువు 2.5 కేజీలు ఉంటుందని చెబుతున్నారు.