TTD Two Electric Scooters Donated: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతి రోజూ దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.. కొందరు కానుకలు, విరాళాలను అందిస్తుంటారు. తాజాగా తిరుపతికి చెందిన సంస్థ తరఫున ఇద్దరు భక్తులు కానుకల్ని అందజేశారు. ఏఎంఆర్డీ బిల్డర్స్ ఎండీలు మారుతి, దేవేంద్రలు రెండు బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేశారు. టీటీడీని వీటిని విరాళంగా అందజేశారు. ఈ మేరకు స్కూటర్ల తాళాలను అందజేశారు.