TTD Rs 1.50 Crores Donation To Sv Pranadana Trust: తిరుమల శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1.50 కోట్ల విరాళం అందజేసింది. ఈ విరాళాన్ని పేద రోగుల ఉచిత వైద్యం కోసం వినియోగిస్తారు. గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత వ్యాధులకు చికిత్స అందిస్తారు. మరోవైపు దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మే 10 నుంచి 12 వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు స్వామి అమ్మవార్లు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.