Tirumala Banglore Devotee Rs 1 Crore Donation: తిరుమల శ్రీవారికి బెంగుళూరుకు చెందిన భక్తుడు శ్రీ కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం అందజేశారు. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి డీడీ అందజేశారు. తిరుమలకు వచ్చే వాహనాలకు ఆగస్టు 15 నుంచి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాల కోసం అలిపిరి వద్ద కేంద్రం ఏర్పాటు చేశారు.