Tirumala Hyderabad Devotee Rs 75 Lakhs: హైదరాబాద్కు చెందిన A.D.O ఫౌండేషన్ (NGO) తిరుమల శ్రీవారికి రూ.75 లక్షలు, బెంగళూరుకు చెందిన భక్తుడు ఎం రాకేష్ రెడ్డి రూ.10 లక్షలు, టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ రూ.10 లక్షలు విరాళంగా అందించారు. అక్టోబర్ 25న నాగుల చవితి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష వాహనంపై భక్తులకు తిరుమలలో దర్శనమివ్వనున్నారు. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.