Tirumala Bangalore 7 Gold Medallions Donated: తిరుమల శ్రీవారికి బెంగళూరు భక్తురాలు భారీగా బంగారాన్ని విరాళంగా అందజేశారు. డాక్టర్ మహాదేవమ్మ స్వామివారికి రూ.94.80 లక్షల విలువైన 753 గ్రాముల ఏడు బంగారు పతకాలను అందజేశారు. దాతల్ని టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో అభినందించారు. అలాగే హైదరాబాద్కు చెందిన ఇద్దరు భక్తులు రూ.20 లక్షలు విరాళాన్ని కూడా అందజేశారు. వీరిద్దరు శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు ఈ విరాళాలను అందజేశారు.