Mumbai Devotee Donated Rs 90 Lakhs: ముంబైకి చెందిన అల్కెమ్ ఫౌండేషన్.. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహఇంచే శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి రూ. 90 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను విరాళంగా అందించింది. ఈ పరికరాలను టీటీడీ జేఈవో (ఆరోగ్యం & విద్య) డా ఏ శరత్కు అందజేశారు. మరోవైపు, తిరుమలలో మాఘ శుద్ధ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.