తిరుమల శ్రీవారికి విజయవాడ, కాకినాడ వాసుల భారీ విరాళాలు.. ఎంతో తెలుసా..?

11 months ago 11
తిరుమల శ్రీవారికి కాకినాడ, విజయవాడకు చెందిన భక్తులు విరాళాలు సమర్పించుకున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళాలకు సంబంధించి డీడీలను అందించారు. విజయవాడ భక్తుడు రూ.10 లక్షలు, కాకినాడకు చెందిన భక్తుడు రూ.6 లక్షలు చొప్పున టీటీడీకి విరాళాలు అందించారు. ఈ సందర్భంగా దాతలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు అభినందించారు. మరోవైపు ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను టీటీడీ ఛైర్మన్ ఆవిష్కరించారు.
Read Entire Article