Tirumala Hyderabad Company 1 crore Donation to TTD: తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం వచ్చింది. హైదరాబాద్కు చెందిన కంపెనీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కోటి విరాళం ఇచ్చింది. హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును శుక్రవారం కలిసిన కంపెనీ ప్రతినిధి కోటి రూపాయలు విరాళం తాలుకూ డీడీని అందించారు.