Yalamanchili Madan Mohan Donated Rs 30 Lakhs To TTD Trusts: తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ ట్రస్టులకు హైదరాబాద్కు చెందిన యలమంచిలి మదన్మోహన్ రావు రూ.30 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఆయన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. రంగనాయకుల మండపంలో ఈ విరాళాన్ని అందజేశారు. ఇటీవల కాలంలో టీటీడీకి భక్తులు భారీగా విరాళాలు అందజేస్తున్నారు.