ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయితే పథకం అమలుకు సంబంధించి తాజాగా కొన్ని నిబంధనలు తెర మీదకు వచ్చాయి. దీని ప్రకారం కొన్ని రూట్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి నుంచి తిరుమల కొండకు వెళ్లే బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తిస్తుందా లేదా అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. దీనిపై ఆర్టీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..