Tirumala Car Catching Fire In Parking: తిరుమలలో కౌస్తుభం పార్కింగ్ వద్ద ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ఒంగోలుకు చెందిన భక్తులు కారులో పొగలు రావడాన్ని గమనించి వెంటనే దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు భక్తులతో మాట్లాడి దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏప్రిల్ 19 నుండి కార్వేటినగరంలో వేణుగోపాలస్వామి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి.