ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజినోవా తన కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్నిప్రమాదం నుండి సురక్షితంగా బయటపడినందుకు కృతజ్ఞతగా నేడు తిరుమలకు వెళ్లనున్నారు. రేపు తిరుమలలో శ్రీవారికి.. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించనున్నారు. తన కుమారుడు ప్రమాదం నుండి క్షేమంగా బయటపడాలని ప్రార్థించిన అభిమానులకు, జనసైనికులకు, శ్రేయోభిలాషులకు, సినీ పరిశ్రమలోని వారికి .. ఇతర మద్దతుదారులకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.