Tirupati Police Alert Tirumala Devotees: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుపతి పోలీసులు ముఖ్యమైన సూచనలు చేశారు. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు తిరుపతిలో కనీసం రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనివల్ల వాహనాల ఇంజన్ వేడి తగ్గుతుంది, డ్రైవర్లకు నిద్ర మత్తు వదులుతుంది. రాత్రి దర్శనం పూర్తయితే తిరుపతిలో విశ్రాంతి తీసుకుని ఉదయం ప్రయాణం చేయడం మంచిది. ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేశారు.