Tirumala Devotees Mangalya Puja: తిరుమలలో భక్తులకు జరుగుతున్న మోసాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. తమిళనాడుకు చెందిన మురుగన్ నాగరాజు అనే వ్యక్తి, టీటీడీ ఉద్యోగినని నమ్మించి, మాంగల్య పూజల పేరుతో భక్తులను మోసం చేస్తున్నాడు. అతడిని అరెస్టు చేసి 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. తిరుమలలో ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.