వేసవి సెలవులు, ఆదివారం రోజున యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. దీంతో ఒకేరోజు 90 వేల మందికిపైగా భక్తులు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే భక్తుల దర్శనాల విషయంలో యాదగిరిగుట్ట తిరుమలను దాటేయడం గమనార్హం. హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఉండటంతో నగరవాసులు కూడా భారీ ఎత్తున పోటెత్తారు. భక్తులు భారీగా తరలిరావడంతో.. కొండ పైన, కొండ కింద రద్దీ కనిపించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఆదివారం రోజున స్వామి వారిని దర్శించుకున్నారు.