తిరుమలపై అసత్య ప్రచారం.. సాక్షిపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

6 months ago 10
తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. తిరుమలలో బీఆర్‌ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ నాయడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందని మండిపడ్డారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని.. బీఆర్‌ నాయుడును చూసి వైఎస్సార్‌సీపీ భయపడదంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. బీఆర్‌ నాయుడు, చంద్రబాబు ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ బీఆర్ నాయుడు.. టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో సాక్షి మీడియాపై పరువు నష్టం దావా వేశారు. తిరుమల ఆలయంపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. తక్షణమే టీటీడీకి సాక్షి మీడియా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు.
Read Entire Article