తిరుమలలో అంబటి రాంబాబు షర్ట్‌పై వివాదం.. టీటీడీకి ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ రమేష్

1 year ago 12
Ambati Rambabu Tirumala Jagan Sticker: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే అంబటి తీరు ఇప్పుడు వివాదంగా మారింది.. జగన్ బొమ్మతో పాటు పార్టీ గుర్తు ున్న బ్యాడ్జ్‌తోనే ఆలయంలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడంపై వివాదాస్పదమైంది. తిరుమలలో రాజకీయ పార్టీల జెండాలు, బొమ్మలతో రావడం నిషేధం.. కానీ ఈ నిబంధనను పట్టించుకోకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అంబటి తీరుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషేధమని.. అయినా అంబటి రాంబాబు పార్టీ గుర్తుతో పాటు జగన్ బొమ్మ ఉన్న బ్యాడ్జ్‌తో ఆలయంలోకి రావడం దారుణమన్నారు. ఆయనపై టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ సీఎం రమేష్ చెప్పారు.
Read Entire Article