తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి కొండపై మరోసారి అపచారం జరిగింది. ఎంతో పవిత్రంగా భావించే కొండపై భక్తితో నారాయణున్ని నామస్మరణ చేసుకోవాల్సిన స్థలంలో తమ కక్కుర్తితో ఆచారాలను మంటగలుపుతున్నారు. కొండపైన మాసం, మద్యం నిషేదం అని తెలిసినా.. కొంతమంది మాత్రం అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటికే వెలుగు చూడగా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.