తిరుమలలో అపశ్రుతి.. అప్పటి ఘటన.. ఇప్పడు ఆలస్యంగా వెలుగులోకి..

1 year ago 37
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అపశ్రుతి చోటుచేసుకుంది. అయితే 2021లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. 2021లో తిరుమల శ్రీవారి ఆలయంలోని రాములవారి ఉత్సవ విగ్రహం వేలు విరిగిపోయింది. అయితే అప్పటి టీటీడీ సిబ్బంది, పాలకులు దీనిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా అర్చకులు రాములవారి విగ్రహం వేలును సరిచేశారు. మరమ్మత్తులు పూర్తైన తర్వాత రెండు రోజులు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో గతంలో జరిగిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఇన్నిరోజులు చర్యలు తీసుకోకుండా ఉండటంపై భక్తులు మండిపడుతున్నారు.
Read Entire Article