Tirumala Food Quality Testing Laboratory: తిరుమలలో టీటీడీ నూతనంగా ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో జె. శ్యామలరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇకపై స్వామివారి ప్రసాదాలు, నెయ్యి నాణ్యతను ఇక్కడే పరీక్షించవచ్చు. గతంలో ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వచ్చేది. గుజరాత్కు చెందిన NDDB రూ.75 లక్షల విలువైన పరికరాలను విరాళంగా అందజేసింది. ల్యాబ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఈవో శ్యామలరావు తెలిపారు.