తిరుమలలో కొత్త తరహా మోసం.. మాంగల్య పూజ పేరుతో భక్తులకు బురిడీ..

10 months ago 34
తిరుమలలో ‘మాంగల్య పూజ’ పేరుతో తమిళనాడుకు చెందిన మురుగన్ నాగరాజు అలియాస్ శంకర్‌రావు అనే అంతర్రాష్ట్ర మోసగాడిని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ ఉద్యోగినని పరిచయం చేసుకుని.. తమిళనాడు భక్తులను లక్ష్యంగా చేసుకుని మాంగల్య పూజల పేరుతో వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు కాజేసేవాడు. ఇలా తిరువన్నామలై, కోయంబత్తూరు, తిరువళ్లూరుకు చెందిన మహిళలను మోసగించి 132 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో ప్రత్యేక బృందం నిఘా ఉంచి తిరుమలలో అరెస్టు చేసి రూ.13 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై ఆంధ్ర, తెలంగాణలో 20కి పైగా మోసాల కేసులు ఉన్నాయి.
Read Entire Article