Tirumala Darshan Vaikuntam Queue Complex Security Breach: తిరుమలలో క్యూలో వేచి ఉండకుండా సులభంగా దర్శనం చేయిస్తామని భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన దళారుల గుట్టు రట్టయింది. టీటీడీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుతో కలిసి ఎమర్జెన్సీ గేటు తెరిచి 24 మందిని క్యూలైన్లోకి పంపారు. పోలీసులు సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది. మరోవైపు, టీటీడీ పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చేందుకు 'సద్గమయ' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.