తిరుమలలో ఓ మహిళ చీరల వ్యాపారం ప్రమోషన్స్ చేయటం వివాదాస్పదమవుతోంది. బొటిక్ బిజినెస్ నిర్వహించే ఓ మహిళ.. తన భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పలు వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన మహిళ.. తాను ధరించిన చీరను ప్రమోట్ చేశారు. ఆ శారీ వివరాలు, రేటు వంటి సంగతులను పంచుకుంటూ కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చని చీరల వ్యాపారానికి ప్రమోషన్ చేశారు. ఈ వీడియో వైరల్ కాగా.. భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.