Tirumala Biogas Plant Works Review: తిరుమలలో బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు, ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీ సమీక్షించింది. 2026 జనవరి నాటికి ప్లాంట్ అందుబాటులోకి తేవాలని సూచించారు. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఈ పనులపై సమీక్ష చేశారు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయానికి 50 ఏళ్ల ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై ఈవో ఆదేశాలు జారీ చేశారు. భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.