పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో డ్రోన్ సంచారం మరోసారి కలకలం రేపింది. శుక్రవారం రోజున తిరుమల శిలాతోరణం వద్ద ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగరేయడాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే వారికి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇద్దరు ఇస్కాన్ భక్తులు డ్రోన్ ఎగరేయడాన్ని టీటీడీ ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. అలాగే స్థానిక పోలీసులకు వారిని అప్పగించినట్లు వెల్లడించింది.