Drone Camera In Tirumala: తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. శిలాతోరణం వద్ద ఓ విదేశీయుడు డ్రోన్ ఎగరవేయడంతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా డ్రోన్లను నిషేధించినా, నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగ్గా.. టీటీడీ అధికారులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు, కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం వైభవంగా జరిగింది.