తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి చేరుకుంటారు. గోవింద నామస్మరణతో వేలాది మంది మెట్ల మార్గంలోనూ కొండపైకి చేరుకుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. తిరుమల వెళ్తే తలనీలాలు ఇవ్వడం, హుండీలో డబ్బులు వేయడం, శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకోవడంతో దర్శనం పూర్తయినట్లు భావిస్తారు చాలా మంది. శ్రీవారికి తలనీలాలు సమర్పించడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాతన గాథ ఉంది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..