శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు.. గుండెపోటుకు గురికాగా.. ఓ పోలీస్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. దీంతో ఆయన ప్రాణాలు దక్కాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దర్శనం పూర్తి ప్రసాదం తీసుకుని.. కుటుంబసభ్యులతో కలిసి వస్తుండగా భక్తుడు గుండెపోటుకు గురయ్యారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ స్పందించారు. సీపీఆర్ చేయడంతో కోలుకున్న అతడ్ని.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి.. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి పంపారు.