Tirumala Temple Fake Video Viral: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. అయితే, కొందరు ఆగస్టు 16న భక్తులు పరుగులు తీస్తున్నారంటూ తప్పుడు వీడియోను వైరల్ చేశారు. దీనిపై స్పందించిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ అది ఫేక్ వీడియో అని తేల్చింది. భక్తులు క్యూ లైన్లలో సాఫీగా వెళ్తున్నారని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.