ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కొంతమంది తిరుమలలో అత్యుత్సాహం ప్రదర్శించారు. టీటీడీ నిబంధనలు విరుద్ధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా రీల్స్ చేశారు. పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకాన్ని వీడియో తీయటంతో పాటుగా ఈ పుస్తకంపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.