తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. టీటీడీ కొత్త ప్లాన్.! ఎల్అండ్‌టీ సహకారం..

8 months ago 11
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భద్రతా ప్రణాళికల రూపకల్పన కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ సహకారం తీసుకుంటోంది. ఈ క్రమంలోనే శుక్రవారం టీటీడీ ఈవో శ్యామలరావుకు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మరో 40 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచించాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఎల్‌అండ్‌టీ ప్రతినిధులకు సూచించారు.
Read Entire Article