Tirumala Vaikuntam Queue Complex Spiritual Experience Centre: తిరుమలలో భక్తులకు డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో ఏఐ, వీఆర్ సాయంతో శ్రీవారి చరిత్ర ఆవిష్కరిస్తారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఆధ్యాత్మికత, ప్రశాంతత కలిగించేందుకు ఈ హీలింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. గతేడాది బ్రహ్మోత్సవాల సమయంలో చంద్రబాబు సూచనలు చేయగా.. టీటీడీ దీనిని ఏర్పాటు చేసింది.