Tirumala Kalyanakatta Barbers Taking Bribe From Devtoees: తిరుమలలో భక్తుల నుండి క్షురకులు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కళ్యాణ కట్టలో మహిళా క్షురకురాలు గుండుకు రూ.100 వసూలు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ తనిఖీల అనంతరం కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటనపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.