తిరుమలలో ఉగాది పండుగ వేళ భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో.. సాధారణ భక్తుల సౌకర్యార్థం.. టీటీడీ బ్రేక్ దర్శనాలకు ఐఏఎస్లు, ఐపీఎస్లు, స్థానిక అధికారుల సిఫారసులను రద్దు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ.. వేసవి కాలంలో రద్దీ చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది.