తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి పెరిగింది. వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం మే ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.