Tirumala Tarigonda Vengamamba Anna Prasadam Kendram Timings: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ నిత్యం ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8.30 నుంచి రాత్రి 11.00 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంటుంది. తిరుమలతో పాటు తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఒంటిమిట్ట రామాలయంలో కూడా త్వరలో అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు.